రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో మంద భీమ్ రెడ్డి

రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో మంద భీమ్ రెడ్డి

 

రియాద్ లో భారత గణతంత్ర 
వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి 

జగిత్యాల IMG-20250126-WA2201

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

సౌదీ పర్యటనకు వచ్చిన మంద భీంరెడ్డిని ఈ సందర్బంగా కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్, అనంతపూర్ కు చెందిన చేతన లు ఎంబసీ ఆవరణలో పలువురు ప్రవాసీలకు, ఎంబసీ అధికారులకు పరిచయం చేశారు. 

సౌదీ లోని భారత రాయబారి అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్, ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, ఎంబసీ అధికారులు దినేష్ సేతియా, మెయిన్ అఖ్తర్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత డా.  అన్వర్ ఖుర్షీద్, సామాజిక సేవకులు రంజిత్ చిత్తలూరి, షిహాబ్ కొట్టుకుడ్, సిద్దిఖ్ తువ్వూర్, ఫారూఖ్, ఉప్పు సురేష్, జంగిలి హరీష్ తదితరులను మంద భీంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 

Tags:

Related Posts

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.