ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 5 : జగిత్యాల పట్టణంలోని అల్పోర్స్ జూనియర్ కాలేజి,ఎస్ కె ఎన్ ఆర్ ఉమెన్స్ కళాశాల, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, ఎన్ఎస్వి జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల సెంటర్లను బుధవారంజగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం విద్యార్థులు 14,450 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు అని వీరి కోసం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాలు ప్రాంతాలలో బిఎన్ఎస్ యాక్ట్ (144) సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలు సడలిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, ఎమ్మార్వో రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.