మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 10: మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున రమణా గుండె పోటుతో మరణించగా వారి కుటుంబానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం, కార్పస్ ఫండ్ కింద మంజూరు కాబడిన రూ.7,56,000 సంబంధించిన రెండు చెక్కులను హెడ్ కానిస్టేబుల్ రమణ భార్య, కుమారునికి అందజేశారు.రమణా కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సిన బకాయిలను త్వరితగతిన అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా సంప్రదించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శశికళ, సూపరింటెండెంట్ నయీమ్, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య పాల్గొన్నారు.