నృసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఎల్ ఐ సి జోనల్ మేనేజర్
నృసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్న.
ఎల్ ఐ సి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్.
ధర్మపురి,
లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని ఎల్ఐసి అధికారులతో కలిసి శనివారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు , అర్చకులు దేవాలయంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా రంగమైన ఎల్ఐసి సంస్థలో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన వెంట
చీఫ్ ఇంజనీర్ ఆర్ ఎల్ ఎన్ స్వామి ,కరీంనగర్ ఎస్ డి ఎం ఎస్ వి ప్రసాద్ రావు ,
మార్కెటింగ్ మేనేజర్
ఎంఆర్కె శ్రీనివాస్ ,
జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ బలరామకృష్ణ ,
ధర్మపురి, మంతెన బ్రాంచ్ మేనేజర్లు శుభాకర్ రావ్, ఇందారపు రాం కిషన్,
ఏబీఎం శివరాం , ఎల్ఐసి డి ఓ శ్రీకర్ ,ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.