ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఎస్పీ అశోక్ కుమార్

ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఎస్పీ అశోక్ కుమార్

ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ.

అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.


జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 22:  ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో డిఎస్పిలు, సిఐలతో పోలింగ్ రోజు,పోలింగ్ ముగిసిన తరువాత భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. ఎమ్మెల్సీ ఎన్నికల ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం అని పోలింగ్‌ ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పీ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను కాపాడడం, ఎన్నికల నియమావళి పాటించబడేలా చూడడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరోధించడం వంటి బాధ్యతలు పోలీస్‌ అధికారులపై ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని, ఇతర శాఖలతో సమన్వయంతో చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 71 పోలింగ్ కేంద్రలో 36,423 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.   జిల్లా ప్రజలు మరియు ఓటర్లు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భీమ్ రావు ,డిఎస్పిలు రఘు చందర్, రాములు సిఐలు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వేణు పాల్గొన్నారు.IMG-20250222-WA0036

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.