రాజనితి శాస్త్రంలో కొండా గోవర్ధన్ కు డాక్టరెట్
*రాజనీతి శాస్త్రంలో కొండ గోవర్ధన్ కు డాక్టరేట్*
డాక్టర్ కొండ గోవర్ధన్ ను సత్కరించిన మిత్రులు
నిర్మల్
నిర్మల్ నివాసం ఉంటూ ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న "కొండ గోవర్ధన్ " శనివారం నాడు హైదారాబాద్ లో డాక్టరెట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధన కూ గాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు.
"పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ పొలిటికల్ అవేర్నెస్ అఫ్ గ్రాస్ రూట్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్" అనే అంశం పై ఉస్మానియా యూనివార్సిటీ ప్రొఫెసర్ నాయుడు అశోక్ గారి మార్గదర్శనంలో విజయవంతంగా పరిశోధన పూర్తి చేశారు.
నేరడిగొండ మండలంలోని మారుమూల గ్రామం గుత్పల నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న ఆయనకు నిర్మల్ లో వారి శ్రేయోభిలాషి స్వదేశ్ పరికిపండ్ల ప్రవాసి మిత్ర కార్మిక సంఘం అధ్యక్షులు, మిత్రులు మేరుగు సాయికుమార్, తుముల శ్రీనివాస్, గంగా కిషన్, మరియు ఫసియొద్దీన్ లు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.