మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష బాధిత మైనర్ బాలికకు రూ.2లక్షల పరిహారం
మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
బాధిత మైనర్ బాలికకు రూ.2లక్షల పరిహారం
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 3: జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన సుంకల శ్రీనివాస్కు 20 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించారు. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికకు రూ.2లక్షల
పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఏవరు కూడా శిక్ష నుండి తప్పించుకోలేరని, పోలీసులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది న్యాయ విచారణ, న్యాయ నిరూపణ వేగవంతంగా జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చూస్తారన్నారు. మైనర్ బాలిక
అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కృషి చేసిన పిపి చీటి రామకృష్ణారావు, విచారణాధికారులు డిఎస్పీలు వెంకటరమణ, ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ జయేష్రెడ్డి. సిఎంఎస్
ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుళ్లు కిరణ్, శ్రీధర్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.