హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 13: హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ
హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించరాదని ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని,చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని మైనర్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోలీ రోజున పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ , డ్రంక్ అండ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు. హోలీ వేడుకలు ముగిసిన తరువాత స్నానాల కోసం అధిక నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. పండుగ వేళ ఇతరులపై బలవంతంగా రంగులు వేయడం, గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.