నక్సలైట్ల అంతు చూసిన నిరంజన్ రెడ్డి.. ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ టార్గెట్. ధైర్యసహసాలకు కానిస్టేబుల్ నుండి పెట్టింది పేరు. 1994లో ముఖ్యమంత్రి సేవా పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐపిఎంకు ఎంపిక.
నక్సలైట్ల అంతు చూసిన నిరంజన్ రెడ్డి..
ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ టార్గెట్.
ధైర్యసహసాలకు కానిస్టేబుల్ నుండి పెట్టింది పేరు.
1994లో ముఖ్యమంత్రి సేవా పథకం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐపిఎంకు ఎంపిక.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 25 : నక్సలైట్ల అణిచివేత కార్యక్రమంలో తొలి నాళ్ళ నుండి ముందు వరసలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడల్ పోలీస్ గ్యాలరీ అవార్డులు లభించింది. కానిస్టేబుల్ నుండి సీఐ వరకు నక్సలైట్లు అణిచివేతలో తనది ఒకే వైఖరి, కనిపిస్తే ఎదురు కాల్పులే.. విద్యార్థి దశ నుండి నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాలు చురుగ్గా పాల్గొన్న నిరంజన్ రెడ్డి సేవలను పోలీస్ అధికారులు గుర్తించి కానిస్టేబుల్ గా ఉద్యోగం ఇచ్చారు. ఇక అప్పటినుండి వెను తిరిగి చూడలేదు. నక్సలైట్లతో అమీతుమీ అంటూ పోరాడిన నిరంజన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ఐగా, ఎస్సైగా, సీఐగా వరుసగా ఆగ్జిలరీ ప్రమోషన్లు కొడుతూ వచ్చారు. పలుమార్లు ఆయనపై పీపుల్స్ వార్ పార్టీ, జనశక్తిలు కాలుపులకు తెగబడ్డాయి. అయినా వెన్ను చూపకుండా వారిని అంతు చూసే పని వదిలిపెట్టలేదు. ఇలాంటి అధికారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఐపిఎంకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి సేవా పథకం, 54 క్యాష్ రివార్డులు, 49 జిఎస్సి లు 32 ప్రశంస పత్రాలు అందుకున్న అధికారిగా పోలీస్ శాఖలో నిరంజన్ రెడ్డి ది ఒక ప్రత్యేకమైన శైలి. శనివారం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు తాను ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. 1989లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిరంజన్ రెడ్డి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో 1990లో కానిస్టేబుల్ విధుల్లో చేరారు. కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పలు తీవ్రవాద వ్యదిరేక పోరాటంలో ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. 1992లో తన స్వంత గ్రామంలో నక్సలైట్ల 2 దళాలు కాల్పులు జరుపగా సీఐ నిరంజన్ రెడ్డి తో పాటు మరో కానిస్టేబుల్ శంకర్ గాయాల పాలయ్యారు. 1992 అక్టోబర్ లో ప్రభుత్వం హెడ్ కానిస్టేబుల్ గా అగ్జిలరీ ప్రమోషన్ కల్పించి సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చింది. 1994లో ముఖ్యమంత్రి సేవ పథకానికి నిరంజన్ రెడ్డి ఎంపికయ్యారు. 2000లో ఏఎస్ఐగా పదోన్నతి పొందిన నిరంజన్ రెడ్డి, 2012 సినియార్టీ ప్రకారం ఎస్ఐగా పదోన్నతి పొంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. 2013 నుండి 2015లో గొల్లపల్లి ప్రతి ఏడాది నవంబర్ 14న 5వేల మంది విద్యార్థుల బాలల దినోత్సవాన్ని జరిపించారు. 2014లో గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో 12వేల మందికి మెడికల్ క్యాంపును నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర డిజిపి
చేతుల మీదుగా ప్రారంభించారు. 2016లో కథలాపూర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్రెడ్డి కథలాపూర్ లో నకిలీ వైద్యులను పట్టుకొని పేదలకు న్యాయం చేశారు. ముంబాయిలో జీవితఖైదు పడి జైలు నుండి తప్పించుకొని తిరుగుతున్న తాండ్రియ్యాల గ్రామానికి చెందిన శ్రీహరిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించి మహారాష్ట్ర డిజిపి నుండి రివార్డును అందుకున్నారు. 2017, 2018లో జగిత్యాల ఎన్ఎస్ఐబీ, ఎస్బిలో విధులు నిర్వర్తించారు. 2023లో నిరంజన్రెడ్డి సీఐగా అగ్జిలరీ ప్రమోహన్ పోంది మెట్ పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక కావడం పట్ల జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ఆయన శుభాకాంక్షలు తెలిపింది.